సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ వాదుల అరెస్ట్‌

నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌, జేఏసీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వెంట బెట్టుకుని విద్యార్థులను సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో పరీక్షల సమయంలో అరెస్టు చేయడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్‌, పదో తరగతి, డిగ్రీ పరీక్షిలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను వదిలిపెట్టాని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు.