సీఎం రిలీఫ్‌ ఫండ్ చెక్ అందజేత

బిచ్కుంద జులై      (జనంసాక్షి) సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదల పాలిట వరంలా మారిందని మాన్యాపూర్ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు దాసరి రాములు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల మాన్యాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు గంగారాం తండ్రి కిష్టయ్యకు 32 వేల రూపాయిల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాడని, పేదలకు ఆసరా అవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంధి సాయిరాం, వినోద్ సేట్, సాయిలు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.