సీజనల్ జ్వరాలతో జాగ్రత్తలు పాటించండి

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 26) :  విష జ్వరాల సీజన్ అవ్వడంతో  తగిన జాగ్రత్తలు పాటించాలని  ఎర్రగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి ప్రియాంక అన్నారు.మంగళవారం మండలంలోని దామరచర్ల  లో  ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి  రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి పరిసరాలను  మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు తగు చర్యలు పాటించాలన్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని   ఆమె   సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్  లక్ష్మీపతి,సెక్రటరీ శంకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.