*సీజనల్ వ్యాధుల తో అప్రమత్తంగా ఉండాలి*

*దేవరుప్పుల,జులై 19 (జనం సాక్షి):* మండలం కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల శిబిరాన్ని నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్యతిధిగా MPP బస్వ సావిత్రి మల్లేశం ప్రారంభించారు.
ముందుగా ప్రజాప్రతినిధులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 182  మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించామని రక్త నమూనాలను సేకరించామని అలాగే
ఉచితంగా మందులు పంపిణీ ఇచ్చామని మండల వైద్యాధికారి కిషోర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ వెంకటస్వామి, ఆరోగ్య పర్యవేక్షకుడు సత్యనారాయణ హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, రామ్‌మూర్తి, ల్యాబ్ టెక్కీషియన్ శ్రీనాత్, ఏఎన్‌ఎం సరిత, పద్మశ్రీ, ఆశా వర్కర్లు ఉన్నారు.
Attachments area