సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి — సీపీఎం

మోత్కూరు జూలై 18 జనంసాక్షి : సీజనల్ వ్యాధుల నివారణ కు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో డీఎంహెచ్ఓ, మోత్కూరు పిహెచ్సి ద్వారా, మోత్కూరు మండల తహిసిల్డార్ లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు మాట్లాడుతూ…కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాలలో సీజన్ వ్యాధులు, ఇతర విషజ్వరాలు, వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున గ్రామాలలో ప్రజలను వ్యాధుల పట్ల అప్రమత్తం చేసి, మలేరియా, డెంగ్యూ, లాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందితో తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా, మరియు కలరా, టైఫాయిడ్, లాంటివి ప్రజలకు సోకకుండా గ్రామ పంచాయితీలలో, మున్సిపాలిటీలలో, వాటర్ ట్యాంకులను శుభ్ర పరచేవిదంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్,పిట్టల చంద్రయ్య, చింతకింది సోమరాజు, వడ్డేపల్లి లక్ష్మణ్, వెండి యాదగిరి, దడిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area