సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కొన్నె సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్…

బచ్చన్నపేట అక్టోబర్ 12 (జనం సాక్షి )

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మండల లోని కొన్నె గ్రామ సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్. అన్నారు బుధవారం కొన్నె గ్రామపంచాయతీ ఆవరణలో ఆర్విఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రారంబించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వా‌ర్డుసభ్యులు .గ్రామ పంచాయతీ సిబ్బంది. ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.