సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎంపీడీవో జయరావు

మండలం నర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ బెల్లం రాజు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కాలనీలలో తిరుగుతూ ప్రజలకు ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో జయరావు అన్నారు. ప్లాస్టిక్ డబ్బాలో. కాళీ ట్రాక్టర్ టైర్లలో మరియు ఒకే ప్రదేశంలో నీరు ఎక్కువ రోజులు నిలిచి ఉండటం వలన అలాంటి ప్రదేశంలో  దోమలు గుడ్లుపెట్టి  వృద్ధిచెంది మనుషులను కుట్టడం వలన  డెంగ్యూ. మలేరియా  ఇతరత్రా వ్యాధుల బారినపడే అవకాశం ఉందని గ్రామస్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి కార్యదర్శి మహేందర్. కరోబార్ కరుణాకర్. ప్రసాద్ . ఆశ వర్కర్ కనక లక్ష్మి . స్వరూప. కనుకస్వామి తదితరులు పాల్గొన్నారు.