సీపీఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

 పినపాక నియోజకవర్గం జూలై 22 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన రాయిగూడెం గ్రామం గోదావరి వచ్చి ఇండ్లన్ని నీట మునిగిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చి  ఇబ్బందులు పడుతున్న వారికీ సహాయంగా సీపీఐ  ఆధ్వర్యంలో మణుగూరు మండల,పట్టణ కార్యదర్శులు జంగం మోహనరావు, దూర్గ్యల సుధాకర్    శుక్రవారం సుమారు 70 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోదావరి ముంపుకు గురైన,బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని, ప్రభుత్వం వీరిని అదుకోవాలని, కొంతమంది గోదావరి వరద ముంపుకు గురైనా  వారి పేర్లు కొన్ని నమోదుకాలేదని వారి పేర్లు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇండ్లు కూలిపోయిన వారికి డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని కోరారు.పాక్షికంగా దెబ్బతిన్నా ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ,గిరిజన సంఘము జిల్లా నాయకులు సొంధే కుటుంబరావు, మాజీ మండల కార్యదర్శి ఎస్ కే సర్వర్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area