సీపీఐ చేర్యాల పట్టణ కమిటీ ఎన్నిక

సీపీఐ పట్టణ కార్యదర్శిగా ఉడుగుల శ్రీనివాస్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) చేర్యాల పట్టణ కార్యదర్శిగా ఉడుగుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. సీపీఐ చేర్యాల పట్టణ కార్యదర్శిగా ఉడుగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కర్రె రవి, కార్యవర్గ సభ్యులుగా అవుశెర్ల కృష్ణ, గజ్జల సురేందర్, ముస్త్యాల శంకరయ్య, ఇప్పకాయల వెంకటేశం, జీ. రవికుమార్, అందె బాబు, బింగి పోషయ్య, తిగుల్ల కనకయ్య, పుట్ట నర్సయ్య మొత్తం 11మందితో పట్టణ కమిటీని ఎన్నిక చేశారు. ఈసందర్భంగా వారు నూతన కమిటీ నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలో నెలకొన్న సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ బలోపేతమే దిశగా నిరంతరం కృషి చేస్తామని వారు అన్నారు. తమ ఎన్నికకు కృషి చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ తో పాటు జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Attachments area