సీమాంధ్ర పార్టీలో తెలంగాణ సాధించలేం : హరీశ్వర్రెడ్డి
రంగారెడ్డి : సీమాంధ్ర పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పరిగిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగం సభలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్వర్రావుతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్లో చేరారు. అనంతంరం బహిరంగం సభలో మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తనకు తెలుసునని హరీశ్వర్రెడ్డి అన్నారు. అందుకే పరిగి ప్రజల అనుమతితో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. సీమాంధ్ర పార్టీలో ఉంటూ తెలంగాణ సాధించలేమని రెండు సంవత్సరాల కిందనే టీడీపీకి, పదవికి రాజీనామా చేశానని తెలియజేశారు. ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబునాయుడేనని ఆయన విమర్శించారు.