సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని… శివాలయంలో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల …

ఇల్లందు జూన్ 4 (జనం సాక్షి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వారి  కుమార్తె ప్రియాంక గాంధీ కరోనా లక్షణాలతో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. వారు భగవంతుని దయవల్ల త్వరగా కోలుకొని కాంగ్రెస్ పార్టీకి నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ శనివారం రోజు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ  కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షులు పులి సైదులు, కామేపల్లి జెడ్ పి టి సి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ జగన్నాథం, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరికృష్ణ, సర్పంచ్ ధనసరి స్రవంతి, పట్టణ ఉపాధ్యక్షులు ఐజక్,  పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, పట్టణ మైనార్టీ నాయకులు మసూద్, పట్టణ ఎస్సీ సెల్ నాయకులు వాంకుడోత్ నాగరాజ్, ఐఎన్టీయూసీ నాయకులు వెంకట నారాయణ, మహిళా నాయకురాలు చెంచమ్మ, ఐఎన్టీయూసీ నాయకులు తోట వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ రాజ్ చైర్మన్ ఎండి ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, గొడుగు వేణు, ఎస్సీ సెల్ నాయకులు ఉపేందర్, సిహెచ్ ఈశ్వర్, గోకేల పాపారావు, మండల నాయకులు ధనసరి రాజు, వాదం నరేష్, కల్తీ రామస్వామి, ముక్తి రాజు, కాయం రమేష్ తదితరులు పాల్గొన్నారు.