స్కార్పియో బోల్తా… నలుగురి మృతి

కట్టంగూర్‌ : నల్గోండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరోకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.