స్కార్పియో బోల్తా, నలుగురి మృతి

కట్టంగూర్‌: నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.