*స్కూల్ పిల్లలకు వైద్య పరీక్షలు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 08
(జనం సాక్షి)
మెట్పల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని యూపిఎస్ వెంకట్రావు పేట స్కూల్ లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు
రాష్ట్రీయ బాల సురక్ష కేంద్రం
మెట్ పల్లి, బి,టీమ్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ఏ. శ్రీదేవి,డాక్టర్ ఆర్. శ్రావిక, ఫార్మసీస్టు టీ. రాధ, ఏ. ఎన్.ఎమ్ సరిత విద్యార్థిని, విద్యార్థుల కు పరీక్షలు చేసి వైద్య సలహాలు, మందులు అందజేశారు ఈ కార్యక్రమం లో యు. పి .ఎస్ వెంకట్రావు పేట స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ లోక వెంకట రమణ రెడ్డి ,ఉపాధ్యాయులు అల్లకట్టు సత్యనారాయణ , చిన్న అంజయ్య , వైద్య సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు