స్టడీ టూర్ ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / కేసముద్రం మండల వ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో పాటు,ధర కూడా తగ్గుతుండడంతో ఈ ప్రాంతంలో పసుపు విస్తీర్ణాన్ని పెంచడం,ధర కూడా ఆశించిన రీతిలో పొందడానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో భారతదేశంలో పసుపు సాగుకు పేరు ఎన్నిక గల మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతాన్ని సందర్శించడానికి స్టడీ టూర్ ను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు మంగళవారం నాడు తెలిపారు.సాంగ్లీ ప్రాంతంలో పసుపు సాగులో అక్కడి రైతులు వినూత్నమైన పద్ధతులు ఆచరించడంతోపాటు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి సాధించడానికి విభిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారని,ధర కూడా ఆశించిన రీతిలో అక్కడి రైతులు పసుపు పంటకు పొందుతున్నారని చైర్మెన్ తెలిపారు.ఈ మేరకు సాంగ్లీ ప్రాంతాన్ని సందర్శించడానికి స్టడిటూరు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కేసముద్రం ప్రాంతంలో పసుపు పంట పూర్వవైభవాన్ని సాధించడానికి స్టడీ టూరు దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్టు శ్రీను,వైస్ చైర్మన్ బంటు రమేష్,మార్కెట్ డైరెక్టర్లు,కంచ వెంకన్న,మంద భాస్కర్,వ్యాపార ప్రతినిధులు,కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.