స్థానిక ఎన్నికల్లో తెదేపాదే విజయం

చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన మండల తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఏడుసార్లు నిత్యావసరాల ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరగ్గొతున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు మల్లయ్య యాదవ్‌, సైదులు, రామయ్య , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.