స్థానిక ఎన్నిక్లలోనూ సత్తా చాటాలి: కడియం

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి  అన్నారు. రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టడంతో అభివృద్ది పరుగులు పెట్టనుందని అన్నారు.   ఉమ్మడి జిల్లాలో ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రెండు, మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతుందని, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా ఏంటో చాటి గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.  తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని అన్నారు.  తడిచినధాన్యం, మిర్చి కొనుగోలుకు అన్నిచర్యలు తీసుకుంటామని అన్నారు.