హయత్ నగర్ లో రెండు ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల వెండిని అపహరించారు. మరో ఇంట్లో పది వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన కుటుంబసభ్యులు దొంగతనం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.