హలో బీసీ చలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ

జనగామ (జనం సాక్షి)జూలై21: స్థానిక జనగామ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రము ఆవిష్కరణ చేయడం జరిగింది వచ్చే నెల ఆగస్టు 7,8,9 తేదీ నా ఓబిసి మహాసభ జరుగుతుందని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మనం ఎంతో మనకు అంత వాటా కోసం మన జనగామ జిల్లా నుండి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ వెళ్లవలసిందిగా కరపత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ వేముల సాగర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసు,రాష్ట్ర నాయకుడు తీగల సిద్ధూ గౌడ్ జిల్లా కో కన్వీనర్లు దూడళ సిద్దన్న,తాళ్లపల్లి శివరాం గౌడ్’లో,బొల్లం పల్లి నాగేందర్,జంగిడి సిద్ధులు కురుమ, ఏంటే శ్రీనివాసు కురుమ,చింతకింది మల్లేశం, జక్కుల వేణుమాధవ్ యాదవ్, బోయిని రాజు, ఉప్పల మధు నాయి బ్రాహ్మణ,నామాల శ్రీనివాసు,సుధ గాని సంజీవులు పాల్గొన్నారు