హావిూ మేరకు మిషన్‌ భగీరథ

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకంతో గ్రావిూణ ప్రాంతాలు, తండాల్లో ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి మరో 40 రోజుల్లో పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం ప్రజలకు బల్క్‌ వాటర్‌ సరఫరా అవుతోందన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేస్తోందన్నారు. తెలంగాణను అన్నిరంగాల్లో ముందు వరుసలో నిలుపుతున్నారని స్పష్టం చేశారు.