హైద్రాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం- లోక్కుంట్ల ప్రవీణ్

 

జనగామ (జనం సాక్షి)జూలై20:ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ నూతి శ్రీ కాంత్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మీద ఈడీ విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్న కారణం రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు హైద్రాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున నాయకులు పాల్గొనాల్సిందిగా జనగామ ఒబిసి నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని లోక్కుంట్ల ప్రవీణ్ ఒబిసి సెల్ జనగామ జిల్లా ఛైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.