11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు

.11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి3(జనంసాక్షి):
విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో 4 కేంద్రాలు ఏర్పాటుచేయగా, డ్రాయింగ్ లోయర్ లో 371, డ్రాయింగ్ హైయర్ లో 241, టైలరింగ్ హైయర్ మరియు లోయర్ లో 160 మంది అభ్యర్థులు టెక్నికల్ కోర్స్ పరీక్షలకు హాజరుకానున్నారని డిఈవో తెలిపారు.కోర్సుల ఆధారంగా పరీక్ష సమయం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని డీఈఓ పేర్కొన్నారు.టెక్నికల్ కోర్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు మరియు పుట్టిన తేదీని ఎంట్రీ చేసి www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డిఇఓ ఒక ప్రకటనలో తెలియజేశారు.అభ్యర్థులు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నాగర్ కర్నూల్ డిఈఓ కార్యాలయం లో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు ను సంప్రదించాలని ఆయన కోరారు.