18న డబుల్స్ టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు.

– బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.
ఫోటో: బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
రామగుండం పోలీస్ కమిషనరేట్ లెవెల్ ఫ్రీడమ్ కప్ డబుల్స్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 18 బెల్లంపల్లి పట్టణంలోని టీఓసీఏ క్లబ్ లో నిర్వహించనున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ తెలిపారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధ్వర్యంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్బంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. తేది 18-08-2022 రోజున ఉదయం 8 గంటలకు బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్ లో టెన్నిస్ విభాగం లో రెండు కేటగిరీలు ఉంటాయని అండర్ 45, ఎబో 45 కేటగిరీ, అదేవిధంగా బ్యాట్మెంటన్ విభాగం లో కూడా రెండు కేటగిరీలు లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు రమేష్-9849655877, కిషన్ -9849213923, మురళి -99122౭౫910, నయీమ్ -9849892306 లను సంప్రదించి వివరాల నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 16 .8 .2022 అని ఏసీపీ తెలిపారు