20న విద్యాసంస్థ ల బంద్ జయప్రదం చేయండి

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శ  దామెర కిరణ్ టౌన్ జూలై 18 (జనంసాక్షి);
      పాఠశాలలు , ఇంటర్ కళాశాల బంద్ ను జయప్రదం చేయాలని భారత విద్యార్థి సమైక్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఈ దేశంలో వస్తున్నటువంటి నూతన విద్యా విధానం 2020 వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు అందరికీ ఉచిత బస్సు పాసులు అందించాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో సదుపాయాలు కల్పించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు దోపిడీ నియంత్రించి నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విడుదల చేస్తూ పెరిన ధరలకు అనుగుణంగా మెస్  పెంచాలని పలు డిమాండ్లతోటి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  ఈ నెల 20 తేదీ న జరిగే విద్యాసంస్థల బందు జయప్రదం చేయాలని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యం ఈ బంధువు విజయవంతం సహకరించాలని వారు కోరారు పై డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా సహా కార్యదర్శి
SFI జిల్లా ఉపధ్యక్షులు రాజు బొడ్డు కిషోర్,సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు