పరకాలలో 20 నుంచి రాష్ట్ర స్థాయి జూడో

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాలలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికల రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరబోయిన కైలాసం యాదవ్‌ తెలిపారు.