29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహరించాలని విపక్ష పార్టీ సభ్యులను కోరుతామని ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.