619 వికాలాంగుల శ్రమశ్రక్తి సంఘల ఏర్పాటు

మహదేవపూర్‌   (జనంసాక్షి):  కరీంనగర్‌ జిల్లాలో ఉపాధి హామీ పథంలో పనుల చేయడానికి 619 వికలాంగుల శ్రమశక్తి సంఘలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వికలాంగుల శ్రమశ్రక్తి సంఘాల సమన్వయ కర్త జితేందర్‌ తెలిపారు.ఇప్పటివరకు 4,875 మంది పేర్లు నమోదు చేసుకో గా 2600 మంది కూలీలు పనులు చేస్తున్నారని తెలిపారు.81,230 పనిదినాలు కల్పించడం జరిగిందరన్నారు.రు.90 లక్షల చెల్లింపులు జరిగాయన్నారు.