యూరియా కోసం రాస్తారోకో చేపట్టిన రైతులు
చేగుంట : యూరియా కొరత తీర్చాలంటూ చేగుంటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత కొద్దిరోజులుగా చేగుంటలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో సోమవారం వారు రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు.