సీఎం మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నీరు,విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంకు అవసకమైతే కొత్త కమిటీలు కూడా వేసుకోవచ్చని సారయ్య తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రకటన కాంగ్రెస్‌ నిర్ణయం మాత్రమే కాదని, యూపీఏ ప్రభుత్వం  నిర్ణయమని అన్నారు.