ఇన్నాళ్లకో మంచిమాట! యూటీ అయితే ఇరు ప్రాంతాలకు అన్యాయమే : లగడపాట


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమంపై ఎప్పుడూ విషం కక్కే విజయవాడ ఎంపీ ల గడపాటి రాజగోపాల్‌ ఇన్నాళ్లకు ఓ మంచి మాట అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు అన్యాయం జరుగు తుందని తెలిపారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని, ప్రజాభీష్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. ఏపీఎన్జీవోల సభకు అను మతి ఇస్తే ఇంత రాద్దాంతం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చుని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఒత్తిడి చేయబట్టే ఆంటోనీ కమిటీని నియమించారని రాజగోపాల్‌ అన్నారు.