లారీ, ఆటో ఢీ : ముగ్గురి మృతి

దుండిగల్‌: రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ మండలం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దుండిగల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.