78వ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో
కేసముద్రం ఆగస్టు 20 జనం సాక్షి  / మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి కార్యక్రమాలు మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు దసురునాయక్ ,మండల పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ఐటీ రంగాన్ని మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించిన ఘనత రాజీవ్ గాంధీకి చెందుతుంది. శాంతి స్థాపన కోసం రాజీవ్ గాంధీ మానవ బాంబుకు బలి అయినాడు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ,గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం ,ఆనాడు రాజీవ్ గాంధీ ఐటి రంగం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని చేసిన అభివృద్ధి ఈనాడు ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉంచడంలో ఉపయోగపడిందని చెప్పటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు ,కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుటిల యత్నం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీని పటిష్టం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు బాలు నాయక్, ఇస్లావత్ చందు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అయ్యూబ్ ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సత్యానందం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు రఫీ ఖాన్,ఎస్సీ సెల్ మండల చైర్మన్ పాల్వాయి మల్లేశం, ధనసరి ఉప సర్పంచ్ చిన్న వెంకన్న, పరాంకుశం శ్రీహరి, ఎండి తాజుద్దీన్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, పోతుల రవి,అమ్మరాజు రాజు, గుండు గోపాల్, బెల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.