8న జిల్లా స్థాయి పోటీలు

మహబూబ్‌నగర్‌: జాతీయ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌మ్యూజియం కోల్‌కతా ఆదేశాల మేరకు ఎస్సీ ఈ ఆర్టీ నిర్వహించే జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలు, సైన్స్‌ డ్రామాలు, ఉపన్యాస పోటీలు ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు డీఈవో పెంటయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2012ను గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో గణితంపై సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెమినార్‌ మ్యాథమెటిక్స్‌ ఇన్‌ ఇండియా ఫాస్ట్‌, ప్రజెంట్‌, ఫ్యూచర్‌ సైన్స్‌ డ్రామా ధీమ్‌ సైన్స్‌ ఆండ్‌ హైజీన్‌ సబ్‌ ధీమ్స్‌ ఎనర్జీ క్రైసెస్‌, హెల్త్‌ అండ్‌ హైజీన్‌, లైఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఆఫ్‌ సైంటిన్స్ట్‌ వండర్‌ వరల్డ్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌, ఉపన్యాస పోటీలు జీవవైవిధ్యం అనే ఆంశాలపై పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి జిల్లాలోని పాఠశాలల ప్రాధానోపాధ్యాయులు విద్యార్థులను పంపించాలని చెప్పారు.ూపొందించి ప్రకటించాలని కోరారు.