8.5 మీటరర్లకు చేరుకున్న గోదావరి

వరంగల్‌: ఏటూరునాగరం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ఉధ్ధృతి క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఉదయం 6గం. 8.5మీటర్ల నీటమట్టానికి చురుకుంది. అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు.