రంగారెడ్డి జిల్లాలో సామూహిక అత్యాచారం

రంగారెడ్డి  జ‌నంసాక్షి: రంగారెడ్డి జిల్లా గూరుడు మండలం జిలాపూర్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఊరు వెళ్లేందుకు బస్టాప్ దగ్గర వేచి ఉండగా దుండగుల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.