95 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: 95 పాయింట్ల లాభంతో 17,728.20 వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా రావడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 32.45 పాయింట్ల ఆధిక్యంతో 5,380.35 వద్ద ముగిసింది. సన్‌ఫార్మాకు చెందిన షేర్లకు మాత్రం నష్టం వాటిల్లింది.