_పాలఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన చెర్మన్ గొల్ల శ్రీనివాస్ యాదవ్.

దోమ మండల కేంద్రంలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన చైర్మన్ టీఆరెఎస్ అభ్యర్థి గొల్ల శ్రీనివాస్ యాదవ్ ను డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారనీ దోమ సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. అనంతరం చైర్మన్ ఎన్నికైనట్లు గొల్ల శ్రీనివాస్ యాదవ్ కు చెర్మన్ ధ్రువపత్రంను నిర్వాహకులు కేతకిలింగం,బిచ్చిరెడ్డి అందజేశారు.ఈ సందర్బంగా పాలఉత్పత్తి దారుల సహకార సంఘం వచ్చే ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం చేస్తామని తెలిపారు.నూతన చెర్మన్ ను ప్రజాప్రతినిధులు, నాయకులు,డైరెక్టర్లు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపిపి మల్లేషం,మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్,కో అప్షన్ సభ్యులు ఖాజాపాష, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్,మాజీ ఎంపిపి రాజగోపాల చారి,నాయకులు బంగ్లా వెంకటయ్య, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, చంద్ర రెడ్డి, అనంతయ్య,కృష్ణ, మైను, బండి సాయిలు,గౌస్, బిచ్చయ్య,హరిబాబు,గున్ను,వసంత్ రావు, నర్సయ్య,డైరెక్టర్లు రవీందర్ రెడ్డి,పెంటయ్య, హనుమంతు,బీంసెన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.*