నల్గొండ నగరానికి స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024లో రాణించిన ఘనత

నల్గొండటౌన్, సెప్టెంబర్ 07(జనంసాక్షి)
పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) కింద నిర్వహించిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024 లో నల్గొండ నగరం జనాభా కేటగిరీ-3 (<3 లక్షలు)లో రెండవ స్థానం సాధించింది.స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024లో భాగంగా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో, 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించగా, నల్గొండ నగరం అత్యుత్తమ పనితీరు కనబరచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, 2024 సెప్టెంబర్ 7న జైపూర్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్, రాజస్థాన్లో జరిగిన స్వచ్ఛ్ వాయు దివస్ కార్యక్రమంలో నల్గొండ మునిసిపాలిటీకి ₹25 లక్షల నగదు పురస్కారం ప్రదానం చేయబడింది.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొని నల్గొండ నగరానికి లభించిన ఈ ఘనతను స్వీకరించారు. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ చేతుల మీదుగా అందించారు.