పాతబస్తీ జియాగూడలో  తీవ్ర విషాదం

జియాగూడ అగ్ని ప్రమాదంలో తండ్రీ కూతుర్లు మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో  తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను మార్పాలనుకునేలోపే పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.