గన్నవరంలో అత్యవసరంగా ల్యాండయిన స్పెన్‌జెట్‌ విమానం

విజయవాడ : హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం ఈ రోజు ఉదయం విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. తొలుత విశాఖ చేరుకున్న విమానానికి రన్‌వేపై దిగేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దాంతో కాసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టి, గన్నవరం విమానాశ్రయంలో దిగేందుకు ఫైలెట్‌ అనుమతి తీసుకున్నాడు. ఉదయం పది గంటలకు విమానం గన్నవరంలో సురక్షితంగా దిగింది. విమానంలో 79 మంది మ్రయాణీకులున్నారు. గంట తర్వాత అక్కడినుండి విశాఖ బయలు దేరివెళ్లింది.