గాంధీభవన్ ఎదుట న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్ ఎదుట తెలంగాణ న్యాయవాదులు ధర్నాకు దిగారు. రేపు జరిగే పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు.