గాలి బెయిల్‌ కేసులో మరో మలుపు

హైదరాబాద్‌:బెయిల్‌ విషయమై పట్టాబి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి తన వాంగ్మూలంలో సీబీఐకి తెలిసిట్లు సమాచారం.మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్‌ న్యాయవాది ఉమా మహెశ్వరరావు పరిచయం చేశారని యాదగిరి తెలిపాడు.సోమశేఖర్‌రెడ్డి పరిచయం అనంతరం చలపతిరావుతో కలిసి గాలి బెయిల్‌ ఒప్పందం కుదుర్చుకున్నామని అతను తెలిపాడు పట్టాబి రామారావుతో ఒప్పందం చర్చించామన్నాడు.గాలి జనార్ధన్‌రెడ్డి సోమశేఖర్‌రెడ్డిలు ఓసారి మాట్లాడుతూ శర్మ అనే వ్యక్తిని సంప్రదించాలని కోరారని,బెయిల్‌ విషయమై మాట్లాడేందుకు వైజాగ్‌లో తన సోదరుడిని సంప్రదించాలని జడ్డి శర్మ చెప్పారన్నాడు.శర్మ సొదరుడికి డబ్బు ముట్టజెప్పినప్పటికి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ రాలేదని ఆ తర్వాత చలపతిరావును సంప్రదించి గాలి బెయిల్‌ విషయమై మాట్లాడామని యాదగిరి చెప్పాడు సొమశేఖర్‌రెడ్డి దశరధరామిరెడ్డి సురేశ్‌ బాబుతో కలిసి 7 బ్యాడుల్లో చలపతిరావుకు డబ్బులు ఇచ్చామన్నాడు గాలి బెయిల్‌ మొత్తం ఒప్పందంలో రూ.9.50 తనకు ముట్టాయని యాదగిరి సీబీఐకిచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు.