జగన్‌ అరెస్టు దుర్మార్గం – మైసూరారెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు. జగన్‌ను అరెస్టు చేయించిన కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జగన్‌ను అరెస్టు చేయడం న్యాయం కాదన్నారు.