తెలంగాణ తొలిపొద్దు అతడు

ఇంటర్నెట్‌ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్‌ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పేజీకి తీసుకెళ్తుంది ! ఆ పేజీ ఆరంభంలో ‘మీరు కిషన్‌జీ అని అడిగి నందుకు మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాం. మీ కు ‘హిందూ దైవం కిషన్‌ జీ’ కోసం వెతుకుతున్న ట్టయితే కృష్ణ అని టైపే చేయండి’ అని మీకొన్న చిన్న నోట్‌ కనిపిస్తుంది. ఉత్తరాది హిందువులకు ద్వాపర యుగకర్త శ్రీ కృష్ణుడు కిషన్‌జీగా ఆరాధ్య దైవం. ధర్మ సంరక్షణ కోసం ఆయన అవతరించి నట్టు ప్రజలు నమ్ముతుంటారు. ధర్మం చెరబడ్డ ప్ర తిసారీ నేనే ఏదో ఒక రూపంలో అవతరిస్తానని శ్రీ కృష్ణుడే గీతోపదేశంలో చెపుతాడు. దాన్ని భార తీయులు చాలా మందే నమ్ముతుంటారు. ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల స్మృతిలో ‘కిషన్‌జీ’ అ న్ని నామవాచకానికి అర్థమే మారిపోయింది. ఔను ! కిషన్‌జీ అంటే ఇప్పుడు శ్రీకృష్ణు పరమాత్ముడు గుర్తుకు రావడం లేదు. తన జీవిత కాలమంతా వె చ్చించి భారతదేశ విప్లవోద్యమాన్ని మలచిన మల్లో జుల కోటేశ్వర్‌రావు ప్రజల మనోఫలకాల మీద మెదులుతున్నాడు. వికీపీడియాలో ఆయన కోసం పేజీని ప్రారంభించిన నాలుగు రోజుల్లో ఇరవై వేలకు పైన జనం ఆయన గురించి చదివారు. త న పిల్లలు ఎక్కడ ఉన్నా వారిని చల్లగా చూడాలని మల్లోజుల మధురమ్మ గడిచిన నాలుగు దశాబ్దా లుగా లెక్కలేనన్ని సార్లు ఆ దేవుడికే మొక్కుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుణ్ణే స్థాన భ్రంశం చేసి న కిషన్‌జీ ఈ దేశంలోని పీడిత వర్గాలకు ఆరాధ్య దైవంగా మారి పోవడం ఆమె ఊహకు అందని వి షయం. ఒక్క ఆమెకే కాదు, అతనితో చిన్నప్పుడు పెద్దపల్లిలో కలిసి చదువుకున్న వాళ్ళల్లో ఏ ఒక్క రూ వాళ్ల ‘కోటి’ కిషన్‌జీగా ఈ దేశ చరిత్రలో చిర కాలం నిలిచిపోతాడని ఊహించి ఉండరు.

గడిచిన వారం రోజుల్లో చాలా మందికి అత ని జీవితం, జీవితంలో ఆయన పెంచుకున్న ఆద ర్శాలు, నమ్ముకున్న సిద్ధాంతం, ఆచరణలో అతని నిబద్ధత అంతిమంగా అతను నిర్మించిన మహో ద్యమం కొత్తగా పరిచయం అయ్యాయి. కరీంనగ ర్‌ పాత మిత్రలు ఆయనతో ఉన్న పరియాన్ని, సా న్నిహిత్యాన్ని కథలుగా చెప్పి మురిసిపోతున్నారు. మనుషులు మరణించినా వారిని చూసి మురిసిపో యే సందర్భాలు చాలా అరుదు. మనల్ని బతికిం చే ఏదో ఒక ఆశ వాళ్ళు వదిలి వెళ్ళినప్పుడే అది సాధ్యమౌతుంది. అటువంటి అచండలమైన విశ్వా సాన్ని కోటేశ్వర్‌రావు ఇప్పుడు మన దేశంలోని కోట్లాదిమందికి కలిగించాడు.

ముఖ్యంగా తెలంగాణ అంతటా ఉన్న అతని సన్నిహితుల్లో ఇప్పుడు ఆ ఆశ ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. ఆ ధైర్యమే అతని అంతిమ యాత్రను ఒక వైవిధ్యభరిత జన సమాహారంగా మార్చి వే సింది. కోటేశ్వర్‌రావు నాయకత్వం వహిస్తోన్న పార్టీతో విభేదించి విడిపోయిన వాళ్ళు, ఆ పార్టీ పద్ధతులను విమర్శించే వాళ్లు మొదలు ఆయనతో అసలు పరిచయం లేని వాళ్లు, ఆయనను పొట్టన పెట్టుకున్న పాలక వర్గాలకు చెందిన వాళ్ళు అనేక మంది ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిం చారు. ఈ అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా అతని తో ఏర్పడ్డ బంధం తెలంగాణ ఉద్యమ ప్రస్థానం లో తెలంగాణ అతని తొలి పాఠశాల.

తొలి తెలంగాణ ఉద్యమం(1969) ఒక్క కో టేశ్వర్‌రావుకే కాదు, ఆయన తరానికి చెందిన వేలాది మంది యువకులకు ఎన్నో పాఠాలు నే ర్పింది. అప్పటికే వందలాది మంది యువకులను అప్పటి ప్రభుత్వం కాల్చి చంపింది. పోలీసుల నిర్భంధం, అరెస్టులు, జైళ్లు, తుపాకీ తూటాలతో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం తన విశ్వరూపాన్ని ప్రద ర్శిస్తోన్న దశ అది. ఆ ఉద్యమంలో అరెస్టయ్య, బ యటికి వచ్చిన కోటేశ్వర్‌రావు 1971లో పెద్దపల్లి వదిలి డిగ్రీ చదవడం కోసం కరీంనగర్‌ వచ్చారు. అతనికి సంతోష్‌కుమార్‌, ఎన్‌.శ్రీనివాస్‌, నారదా సు లక్ష్యణరావు వంటి మిత్రుల సాహచర్యం దొ రికింది. అప్పటికి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌, జగిత్యాలలో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండేవి. అదేకాలంలో జమ్మికుంటలో అక్కడి సోషలిస్టు ఆదర్శాలున్న సంపన్న రైతులు కొందరు ఆదర్శ కాలేజీ పేరుతో ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ పౌరుల ఆశ లు విఫలమై అక్కడికి చేరుకున్న కొత్త తరానికి ఆ కాలేజీలు ప్రధాన అధ్యయన కేంద్రాలుగా మారి పోయాయి. జమ్మికుంట ఆదర్శ కాలేజీలో నల్లా సుధాకర్‌రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, ఆవునూరి సమ్మయ్య, శనిగరం వెంక (సాహూ), మడిపల్లి తిరుపతి, చంద్రప్రభాకర్‌ వంటి యువకులు క్రియాశీలంగా ఉండేవాళ్ళు.

అప్పటికి ఇంకా శ్రీకాకుళ పోరాట పవనాలు కరీంనగర్‌ దాకా చేరలేదు. వరంగల్‌లో కాళోజీ నారాయణరావు, వరవరరావులు ఆ ప్రయత్నం చేస్తోన్న కాలమది. తొలుత తిరుగుబాటు కవులు గా, ఆ తరువాత విప్లవ రచయితల సంఘంగా అక్కడ కార్యక్రమాలు మొదలవుతున్న దశలో ఆ జీజాలను కరీంనగర్‌ మాగాణాల్లోకి తీసుకొచ్చిం ది. భాగ్యనగర్‌ విజయకుమార్‌. కరీంనగర్‌లో అం దరూ విజ్జన్న అని పిలుచుకునే ఆయనకు అప్పటి కే వరంగల్‌తో పరిచయం, వరవరరావుతో సాన్ని హిత్యం ఉంది. ప్రత్యేక తెలంగాణ పోరాట అనుభ వమూ ఉంది. అంతకుమించి శ్రీకాకుళ ఉద్యమం ప్రభావం అతని ఆలోచనను అప్పటికే పూర్తిగా ఆవరించి ఉన్నాయి. విజ్జన్న విద్యుల్లత పేరుతో అప్పటికే ఒక పత్రిక ప్రారంభించారు. కరీంనగర్‌ ను తన కార్యక్షేత్రంగా పెట్టుకున్న విజ్జన్న పంచాది నిర్మల స్ఫూర్తితో నిర్మల ప్రెస్‌ పేరుతో ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రారంభించారు. విజయకుమార్‌ కు మిత్రలు గోపు లింగారెడ్డి, మంజంపల్లి వెంకట రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. వారితోపాటు తాడిగి రి పోతరాజు, అంపశయ్య నవీన్‌, తిరుపతయ్య వంటి మేధావులు తోడయ్యారు. వరవరరావు మార్గదర్శకత్వం మిత్రుల సమష్టి ఆలోచనల పర్య వసానమే కరీంనగర్‌లో ప్రారంభమైన ఉద్యమ సా హితి, యువసాహితి. వీటి ప్రభావంతో జమ్మికుం ట కాలేజీ విద్యార్థులు 1972-73 నాటికి జనసా హితి ప్రారంభించారు. 1970-74 మధ్యకాలం లో ఈ సంస్థలు నిర్వహించిన సదస్సులు, సమా లోచనలు మొత్తం కరీంనగర్‌ యువతరం స్వభా వాన్ని సానబెట్టాయి. కేవలం ఒక్క తెలంగాణ మా త్రమే కాదు యావత్‌ భారత దేశంలో అందులో ప్రధానంగా శ్రామిక వర్గం విముక్తి కావాలన్న స్ఫృహ ఈ సమాలోచనలు కలిగించాయి.

ఈ కార్యక్రమాలు క్రమక్రమంగా ప్రత్యేక తె లంగాణ గాయాలను మాన్పివేయడమే కాకుండా ఆ తరం యువకుల్లో అభ్యుదయ, ప్రగతిశీల ఆలో చనలకు బీజాలు వేశాయి. వీళ్ళ సదస్సులకు శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు మొదలు అనే క మంది కవులు రచయితలు, డాక్టర్‌ కొల్లూరి చి రంజీవి లాంటి వైద్య విద్యార్థులు, కాకతీయ విశ్వ విద్యాలయంలో ఉన్న అధ్యాపకులు కొందరు హాజ రై పాఠాలు బోధించేవారు. 1975 మే నెల 11న హుజూరాబాద్‌లో ఆవునూరి సమ్మయ్య ఆధ్వర్యం లో జరిగిన జనసాహితి సదస్సుకు హాజరైన శ్రీశ్రీ, చెరబండ రాజు కరీంనగర్‌లో కత్తులయి మెరుస్తో న్న నవతరాన్ని చూసి ముగ్థులయ్యారు. ఆ ఉత్సా హంతో ఆయన హుజూరాబాద్‌ అంతా ఆ యువ కులతో కలిసి పాదయత్రలో కలిసి నడిచారు. అ ప్పటికి ఆ యువ సందోహంలో కోటేశ్వర్‌రావుతో పాటు, సాహూ, నల్లా ఆద్దిరెడ్డిలాంటి యువకులు న్నారని, వాళ్లే అతను కలలు గంటున్న నూతన సమాజ నిర్మాతలు కాబోతున్నారని బహుశా శ్రీశ్రీ కి తెలియదు. అప్పుడు మొదలైన కోటేశ్వర్‌రావు ప్రస్థానం అక్కడి నుంచి గ్రామాలకు తరలి, దళిత, పీడిత కులాలకు అండగా నిలబడి తొలుత పాలేర్ల పోరాటమై.. వెట్టి విముక్తికి, గౌరవప్రదమైన కూలీ రేట్ల డిమాండుతో దొరల అహంకారాన్ని అణచివే సే పోరాటాలకు అంకురార్పణవేసింది. జగిత్యాల లో ‘జైత్ర యాత్ర’ అయ్యిదున్నే వాడికే భూమి కా వాలన్న ఆకాంక్షను పేద రైతుకూలీలకు కలిగిం చింది. ఈ పోరాటం మైదాన ప్రాంతాలకూ విస్త రించింది. అదే దారి గుండా గోదావరి దాటి బస్త ర్‌ చీకటి లోకంలో ఉన్న ఆదివాసులకు ‘దివిటీ’ అ యి వెలుగు నింపింది. ఆ వెలుగే అక్కడి నుంచి బీహార్‌, జార్ఖండ్‌, బెంగాల్‌తో సహా భారత దేశ మంతటా విస్తరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

కిషన్‌జీ నిర్మించిన మహోద్యమం తెలిసిన వారికి, ఆయన భారతీయ సమాజాన్ని సామాజికీ కరించిన తీరు గమనించిన వారికి, ఆయన భార త ప్రజాస్వామాన్ని మానవీకరించిన ప్రయత్నాన్ని పరిశీలించిన వారికి అయన అంటే ఎనలేని గౌ రవం. కొన్ని సందర్భాల్లో మావోయిస్టు పార్టీ మీద సునిశిత విమర్శలు చేసిన దళిత బహుజన మేధా వులు డాక్టర్‌ గోపీనాథ్‌, బీఎస్‌ రాయులు వంటి వాళ్లు కోటేశ్వర్‌రావును కులమత జాఢ్యాలకు అం దని ఒక మహానీయుడని, అంతకు మించిన మా నవతావాది అని కీర్తించారు. నిజమే ప్రత్యేక తెలం గాణతో మొదలైన కిషన్‌జీ పోరాటం సామాజిక తె లంగాణ కోసం ఆయన నాయకత్వంలో సాగిన ప్రయత్నం, కులాలు తెగలు జాతుల విముక్తి దిశగ ఆయన సాగించిన ప్రస్థానం వారినే కాదు ఎవ్వరినైనా అబ్బుర పరుస్తాయి. ఆయన తెలంగా ణ తొలిపొద్దు.

కొన్నిసార్లు మన చరిత్ర మనకే అద్భుతమని అనిపిస్తుంటుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్య మం మనకు అలాంటి చారిత్రిక అనుభవాల్ని మి గిల్చింది. సరిగ్గా కోటేశ్వర్‌రావు చదునుచేసిన దా రిలో నడిచి వచ్చిన మాలాంటి వాళ్లకు దారిపొడు గునా ఆ జ్ఞాపకాలు గర్వాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇ స్తాయి. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా ఎప్పుడూ దీర్ఘాలోచనల్లో ఉండే మా విజ యకుమార్‌ సారు తన జీవితంలో ఏం కోల్పోయా డో ఇప్పుడు అర్థమయ్యింది. ఆయన 1985లో ప్రారంభించిన ‘జీవగడ దిన పత్రిక నుంచే జర్న లిస్టులుగా మా జీవితం మొదలైంది. మల్లోజుల కోటేశ్వర్‌రావులాంటి అనేక మందికి ఎలా నడవా లో నేర్పిన విజ్జన్నే జర్నలిజంలో ఎలా రాయాలో నేర్పించారు. రాడికల్‌ విద్యార్థి సంఘం తొలి నా యకుల్లో డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపినాథ్‌ ఒకరు. మొద టి తరంలో దివిటీలై కదిలిన వాళ్లే లేకపోతే ఇవాళ తెలంగాణలో ఈ చైతన్యం లేదు, ఇంతటి ఉద్యమ స్ఫూర్తి లేదు. అదొక సామాజిక విప్లవం. ఆ విప్ల వంలో కోటన్న చివరంటా నిలబడిన సేనాని.

ఇవాళ తెలంగాణలో మాట్లాడుతున్న తొలి తరం మేధావులు, నాయకులు, రచయిత లూ, కవులు, గాయకులూ ఎవరైనా సరే ఆ వెలుగు ప్రసరించకుండా వికసించలేదు. ఆయన తెలం గాణను విముక్తి చేయడానికి, సామాజీకరించ డానికి, ప్రజాస్వామ్యీకరించడానికి వివిధ దశల్లో ఆయన, ఆయన నిర్మించిన ఉద్యమం అనేక ప్ర యత్నాలు చేసింది. అవి అద్భుత ఫలితాలు ఇ చ్చాయి. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణను సాధించుకుని ఇంకా మిగిలి పోయిన ఆ ఎజెండాను పూర్తి చేయడమే తప్ప ఇంకొకటి కాదు.

– సైనిక్‌