తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. సెహ్వగ్‌ 23 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది. గంభీర్‌ 24, పుజారా 1 పరుగులతో ఆడుతున్నారు.