నిరుద్యోగ భృతి ప్రారంభించిన యూపీ ప్రభుత్వం
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించింది. లక్నోలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈ ప్రకటన చేశారు. సమాజ్వాది పార్టీ ఎన్నికల వాగ్దానమైన ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ఇప్పటికే 5 లక్షల మంతి దరఖాస్తు చేసుకున్నారు. 25-40 ఏళ్ల మథ్య వయస్కులు ఈ పథకం కింద లబ్థి పొందడానికి అర్హలు.