నూతన వధూవరులను ఆశీర్వదించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 17:
హైదరాబాద్ నాగోల్ లో శుభం కన్వెన్షన్ హాల్లో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెర్యాల రవీందర్ రావు కుమారుడు సాకేత్ రామారావు, షాలిని వివాహ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మండల తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.