ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. వృద్దులు, దివ్యంగులు , మహిళలు పెద్దఎత్తున ప్రజాదర్బార్ కు వచ్చారు. వారి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి & సి సి ఎల్ ఏ నవీన్ మిత్తల్ విజ్ఞాపనలు స్వీకరించారు. సమస్యలను పరిస్కరించుటకు ప్రభుత్వం దృష్టికి తేనున్నట్లు ఆయన తెలిపారు.హైదరాబాద్ అదనపు కలెక్టర్ మధుసూదన్ ,జి హెచ్ ఎం సి అధికారులు ముషారఫ్ అలీ, రవికుమార్ లు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు.