భీమవరంలో వస్త్రవ్యాపారులు నిరాహార దీక్ష

ఏలూరు : వ్యాట్‌ను రద్దు చేయాలంటూ భీమవరం ప్రకాశంచౌక్‌లో భీమవరం క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వస్త్రవ్యాపారులు బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత గ్రంధి శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు.