ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం వాయిదా

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగుళూరు నుంచి హైదరాబాద్‌  తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ముందుగా నిర్ధేశించుకున్న ప్రణాళిక ప్రకారం నిన్న రాత్రి బెంగుళూరు విళ్లిన సీఎం ఇవాళ కేంద్ర అర్ధిక మంత్రి అధ్య్షతన జరిగే ధక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గోని రాత్రి 8గంటలకు హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఈ రాత్రికి సీఎం బెంగుళూరులోనే బసచేసి రేపు మద్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.